Train Tickets: ఇకపై డబ్బులు లేకున్నా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ఏదైనా ప్రీమియం రైలులో ప్రయాణించాలనుకున్నా బడ్జెట్ సపోర్ట్ చేయకపోయినా టెన్షన్ పడకండి. టిక్కెట్‌ను బుక్ చేసుకోండి.

Train Tickets: ఇకపై డబ్బులు లేకున్నా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Indian Railway Rule 2022

Updated on: Oct 25, 2022 | 4:00 PM

మీరు కుటుంబం మొత్తంతో రైలులో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించాలనుకున్నా, లేదా దేశంలోని ఏదైనా ప్రీమియం రైలులో ప్రయాణించాలనుకున్నా బడ్జెట్ సపోర్ట్ చేయకపోయినా టెన్షన్ పడకండి. టిక్కెట్‌ను బుక్ చేసుకోండి. ఈ టికెట్ డబ్బును తర్వాత చెల్లించండి. అవును ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ విజయవంతమైన వ్యూహాన్ని IRCTC కూడా ఉపయోగించుకోబోతోంది. ట్రావెల్ నౌ పే లేటర్ ఈ సదుపాయం కింద, మీరు ఎటువంటి డబ్బు చెల్లించకుండా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు డబ్బులు చెల్లించుకోవచ్చు.

ట్రావెల్ నౌ పే లేటర్ సదుపాయం కింద మీరు మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు మొత్తాన్ని చెల్లించే బదులు ఈ సదుపాయాన్ని ఎంచుకోవాలి. దీని కోసం CASHe ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే మీరు 3 నుండి 6 ఈఎంఐ ల సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ప్రయాణికులు తత్కాల్, సాధారణ రిజర్వేషన్ కోసం ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. CASHe సోషల్ లోన్ కోటీన్‌ని ఉపయోగించి వినియోగదారుల రిస్క్ ప్రొఫైల్‌ను తనిఖీ చేస్తుంది. దాని ఆధారంగా రుణాన్ని అందిస్తుంది. ఇందుకోసం AI ఆధారిత సాంకేతికతను ఉపయోగించామని, సాధారణ పద్ధతిలో రుణాలు పొందడం సాధ్యం కాని వారికి కూడా రుణాలు ఇవ్వవచ్చని కంపెనీ తెలిపింది.

ఏ కారణం చేతనైనా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఖాతాలో డబ్బులు లేని వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో ఛార్జీల ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. తరువాత డబ్బు వచ్చినప్పుడు ఈ మొత్తాన్ని ఈఎంఐ ద్వారా నెమ్మదిగా చెల్లించవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వంటి చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ కంపెనీల చెల్లింపుల్లో కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us