Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వడ్డీ

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ టీడీ పథకంలో కస్టమర్లు హామీతో చాలా స్థిర వడ్డీ రేటును పొందుతారు. సాధారణ పౌరుడు అయినా లేదా సీనియర్ సిటిజన్ అయినా, అందరు కస్టమర్లు పోస్టాఫీసు TD ఖాతాపై ఒకే వడ్డీని పొందుతారు. కనీస బ్యాలెన్స్..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వడ్డీ
పోస్టల్ సేవింగ్స్ ఖాతా: ఈ పథకం కనీసం రూ.500 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతం. ఇది బ్యాంకు ఖాతా లాగా పనిచేస్తుంది. అలాగే తక్కువ వడ్డీ రిస్క్‌తో సురక్షితమైన పొదుపు ఎంపిక. ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఖాతా తెరవడానికి అనుమతి ఉంది. మనం వరుసగా మూడు సంవత్సరాలు చెల్లించకపోతే, ఖాతా రద్దు అవుతుంది. సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా మీరు మీ ఖాతాను కూడా పునరుద్ధరించవచ్చు.

Updated on: May 16, 2025 | 6:48 PM

Post Office Scheme: పోస్టాఫీసు పొదుపు పథకాలపై మంచి వడ్డీ రేటును పొందవచ్చు. బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసు వడ్డీ రేట్లు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారాయి. పోస్టాఫీసు ఒక పథకం గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, మీకు నేరుగా రూ.2,24,974 స్థిర వడ్డీ లభిస్తుంది.

టీడీ అకౌంట్‌ (టైమ్ డిపాజిట్) పోస్టాఫీసులో ఓపెన్‌ చేయవచ్చు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన TD (టైమ్ డిపాజిట్) ఖాతాలు పోస్టాఫీసులో తీసుకోవచ్చు. పోస్టాఫీస్ తన కస్టమర్లకు 1 సంవత్సరం TD పై 6.9 శాతం, 2 సంవత్సరాల TD పై 7.0 శాతం, 3 సంవత్సరాల TD పై 7.1 శాతం, 5 సంవత్సరాల TD పై 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మీరు పోస్టాఫీసులో 5 సంవత్సరాల టీడీలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 7,24,974 లభిస్తాయి. ఈ మొత్తంలో పెట్టుబడి 5,00,000 తో పాటు వడ్డీ రూ.2,24,974 కూడా ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ టీడీ పథకంలో కస్టమర్లు హామీతో చాలా స్థిర వడ్డీ రేటును పొందుతారు. సాధారణ పౌరుడు అయినా లేదా సీనియర్ సిటిజన్ అయినా, అందరు కస్టమర్లు పోస్టాఫీసు TD ఖాతాపై ఒకే వడ్డీని పొందుతారు. కనీస బ్యాలెన్స్ రూ.1000 టైమ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్‌పై పరిమితి లేదు. పోస్టాఫీసులో మీరు జమ చేసిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుందని గుర్తించుకోవాలి.

పోస్టాఫీసు అనేది ఒక ప్రభుత్వ వ్యవస్థ. దీనిని కేంద్రం నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో జమ చేసిన ప్రతి డబ్బుకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత.  ఇటీవలి కాలంలో పెట్టుబడుల పట్ల ప్రజల్లో అవగాహన కూడా పెరిగింది. ప్రజలు తమ డబ్బును పోస్టాఫీసులతో పాటు బ్యాంకులలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో కూడా అనేక మంచి పథకాలు అమలు అవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us