Income Tax: టాటా, అంబానీతో సహా దేశంలోని పెద్ద కంపెనీలు ఎంత పన్ను చెల్లిస్తాయో తెలుసా? పూర్తి వివరాలు

|

Aug 01, 2023 | 9:11 PM

ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు గడువు ముగిసింది. ఇప్పుడు మీరు పన్ను ఫైల్ చేయాలి. అప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే ఐటీఆర్‌ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది 6 కోట్ల మందికి పైగా పన్ను దాఖలు చేశారు. అయితే దేశంలోని పెద్ద కంపెనీలైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్..

Income Tax: టాటా, అంబానీతో సహా దేశంలోని పెద్ద కంపెనీలు ఎంత పన్ను చెల్లిస్తాయో తెలుసా? పూర్తి వివరాలు
Ambani - Ratan Tata
Follow us on

ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు గడువు ముగిసింది. ఇప్పుడు మీరు పన్ను ఫైల్ చేయాలి. అప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే ఐటీఆర్‌ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది 6 కోట్ల మందికి పైగా పన్ను దాఖలు చేశారు. అయితే దేశంలోని పెద్ద కంపెనీలైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, జిందాల్ తదితర బడా కంపెనీలు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తున్నాయో తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టాటా గ్రూప్‌లోని పెద్ద కంపెనీల గురించి చెప్పాలంటే.. అందులో ఇద్దరు పెద్ద పేర్లు ఉంటాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్. Cleartax నివేదిక ప్రకారం.. TCS FY 2022లో రూ.11,536 కోట్ల పన్ను చెల్లించింది. ఇది కంపెనీ మొత్తం ఆదాయంలో 6.8 శాతం. అదే టాటా స్టీల్ తన టర్నోవర్‌లో 8.4 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇది మొత్తం రూ.11,079 కోట్లు. వారు ఆటోమోటివ్ స్టీల్, హాట్ అండ్ కోల్డ్ రోల్డ్ షీట్‌లు వంటి సేవలను అందిస్తారు.

జిందాల్ కంపెనీ 8 వేల కోట్ల పన్ను:

జిందాల్ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గురించి మాట్లాడితే.. ఈ కంపెనీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి రూ. 8,013 కోట్ల పన్ను చెల్లించింది. ఇది దాని మొత్తం ఆదాయంలో 6.6 శాతం. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ గురించి మాట్లాడితే, ఈ కంపెనీ FY 2022లో దాదాపు రూ. 7,902 కోట్ల పన్ను చెల్లించింది. ఇది మొత్తం ఆదాయంలో 2.9 శాతానికి సమానం.

ఇవి కూడా చదవండి

ముఖేష్ అంబానీ..

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద కంపెనీ. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ భారతదేశంలో అతిపెద్ద పన్ను చెల్లింపుదారులలో ఒకటి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి పన్ను రూపంలో రూ. 7,702 కోట్లు చెల్లించింది. ఇది మొత్తం ఆదాయంలో 1.65 శాతం.

చమురు కంపెనీ 7549 కోట్ల పన్ను

దేశంలోని పెద్ద చమురు కంపెనీలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశంలోని పెట్రోలియం కంపెనీ. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,549 కోట్ల పన్నును కలిగి ఉంది. కంపెనీ భారతదేశంలో డీజిల్, పెట్రోల్ స్టేషన్లను నిర్వహిస్తోంది. సంస్థ 1959లో స్థాపించబడింది. మరోవైపు, భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.7,260 కోట్ల పన్ను చెల్లించింది. ఇది కంపెనీ ఆదాయంలో 6.7 శాతానికి సమానం. కంపెనీ తన కస్టమర్లకు బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ వంటి సేవలను అందిస్తుంది.

ఐటీసీ 4771 కోట్ల పన్ను

ITC లిమిటెడ్ 1910లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. కంపెనీ ఆహారం, సిగరెట్లు, సిగార్లు, కాగితం, వ్యక్తిగత సంరక్షణ, స్టేషనరీ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఆదాయంలో 7.6 శాతం అంటే రూ.4,771 కోట్ల పన్ను చెల్లించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి