పిల్లల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దానిని ప్రారంభించింది. ఆ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)వాత్సల్య. ఇది పిల్లలకు ఉద్దేశించిన పథకం. పదవీవిరమణ ప్రయోజనాలను అందించే పథకం. సింపుల్ గా చెప్పాలంటే మైనర్ల కోసం ప్రారంభించిన రిటైర్ మెంట్ స్కీమ్. దీనిని ప్రారంభించేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫారం ను కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రారంభించింది. ఇందు కోసం మైనర్లైన ఖాతాదారులకు పర్మినెంట్ రిటైర్ మెంట్ అకౌంట్ నంబర్(పీఆర్ఏఎన్)ను ఇస్తోంది. ఈ కొత్త పథకం భారతదేశ పదవీ విరమణ వ్యవస్థలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రారంభ దశలోనే పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) దీనిని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రిటైర్మెంట్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఎన్పీఎస్ వాత్సల్య. ఇది చక్రవడ్డీ శక్తితో దీర్ఘకాలంలో మంచి సంపదను అందిసతుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాదారులకు అనువైన విధంగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది తల్లిదండ్రులు పిల్లల తరపున సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది అన్ని ఆర్థిక వర్గాల కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది.
ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాని ప్రధాన బ్యాంకులు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పెన్షన్ ఫండ్స్ మొదలైన వాటితో కూడిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ) ద్వారా, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ఈ-ఎన్పీఎస్ ద్వారా తెరవవచ్చు.
ది.
ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ నకు సంబంధించిన వివరాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతా ఎలా ప్రారంభించాలి? దానిలోని ఫీచర్స్ ఏమిటి అనే విషయాన్ని వివరించింది. అవేంటంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..