
RBI Notes: ప్రతిరోజూ వాడుతున్న కరెన్సీ నోట్ల వెనుక ఒక పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఇటీవల కాలంలో రూ.1000, రూ.2000 నోట్లు చలామణిలో లేకుండా పోవడంతో, ప్రస్తుతం మన దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు రూ.500 మాత్రమే. అయితే ఈ నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? వీటి తయారీకి అయ్యే అసలు ఖర్చు ఎంత? అన్న విషయాలను ఆర్బీఐ (RBI) అధికారికంగా వెల్లడించింది.
భారతదేశంలో నోట్ల ముద్రణ కోసం మొత్తం 4 ప్రెస్లు ఉన్నాయి. ఇవి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పనిచేస్తాయి:
నోటు విలువను బట్టి దాని ముద్రణకు అయ్యే ఖర్చు మారుతూ ఉంటుంది. ఆర్బీఐ వివరాల ప్రకారం:
నోటు విలువ ముద్రణ ఖర్చు (సుమారుగా)
చిత్రమేమిటంటే, రూ.500 నోటు కంటే రూ.200 నోటు ముద్రణకే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తోంది.
ఏదైనా కొత్త నోటును మార్కెట్లోకి తీసుకురావాలంటే అది డిజైనింగ్, ప్రింటింగ్, మింటింగ్ అనే సుదీర్ఘ ప్రక్రియ ద్వారా వెళుతుంది. నోట్ల డిజైన్, పరిమాణం, భద్రతా ప్రమాణాలను ఆర్బీఐ సిఫార్సు చేస్తే, కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది.
నోట్లు వాడకంలో పాడైపోయినా లేదా చిరిగిపోయినా, ఆర్బీఐ వాటిని వెనక్కి తీసుకుని నాశనం చేస్తుంది. కేవలం మంచి స్థితిలో ఉన్న నోట్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
బ్యాంకు నోట్ల మాదిరిగానే, దేశవ్యాప్తంగా నాలుగు టంకశాలల్లో ముద్రించే నాణేలు కూడా ఉన్నాయి. వీటిని ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడాలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) టంకశాలల్లో తయారు చేస్తారు.
ఆర్బిఐ ప్రకారం, కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం కేవలం దానికే ఉంది. నోట్ల డిజైన్, పరిమాణం, మెటీరియల్ను ఆర్బిఐ సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది. ప్రతి సంవత్సరం కేంద్ర బ్యాంకు రూ.10-20 నుండి రూ.500 వరకు వివిధ డినామినేషన్లలో అవసరమైన నోట్ల సంఖ్యను అంచనా వేసి, ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్డర్లు ఇస్తుంది.
ఇది కూడా చదవండి: RBI: రూ.15 వేల లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నిబంధనల్లో మార్పులు..!
ఇది కూడా చదవండి: Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి