
పడిసి ప్రియులకు వరుస షాక్లు తగులుతున్నాయి. గత కొన్నాళ్లు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా మూడోరోజు మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చేసుకున్నాయి. దీంతో బంగారం కొనేవారు తీవ్ర నిరాశచెందుతున్నారు. ముందే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
బంగారం ధర కేవలం స్థానిక డిమాండ్పైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఇలాంటి సమయాల్లో స్టాక్ మార్కెట్లు నష్టపోయే ప్రమాదం ఉండటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి శుక్రవారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,610 గా ఉంది. ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రూ.2,85,100 వద్ద ట్రేడవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి