
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మొన్నటివరకు ధరలు పడిపోగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, ఆర్ధిక అనిశ్చితి, అమెరికన్ డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత కూడా గోల్డ్ రేట్లు పెరగడం విశేషం. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 19వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430 మధ్య ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,560 వద్ద కొనసాగుతున్నాయి.
-హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430గా పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,560 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,430కి లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,430 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,560 వద్ద ట్రేడవుతున్నాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,710 వద్ద ట్రేడవుతున్నాయి.
-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.
-హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతున్నాయి
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,50,100 పలుకుతోంది