
బంగారం ధర పరుగులు పెడుతోంది.. పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. బంగారం ధర నాన్స్టాప్గా.. పెరిగి లక్షా 10 వేల మార్క్ దాటింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.. మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,360 పెరిగి.. 1,10,290కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.1250 మేర ధర పెరిగి.. రూ.1,01,100 కి పెరిగింది. అటు వెండి కూడా కిలో పై రూ.3వేలు పెరిగి.. రూ.1,30,000కి చేరింది.. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ట్రంప్ సుంకాల సీజన్ మొదలైనప్పటి నుంచి బంగారం- టాప్గేర్లో పరుగులు పెడుతోంది. గత రెండునెలల్లో పసిడి స్పీడుకు పగ్గాలు పడటం లేదు. రోజురోజుకీ ధర పెరుగుతుందేగానీ, డౌన్ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..