Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్‌.. 3 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్‌

|

May 16, 2024 | 11:12 AM

ఈ మధ్య కాలంలో కొన్ని పండగలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూసి ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగగా, రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండనుంది..

Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్‌.. 3 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్‌
Liquor Shops
Follow us on

ఈ మధ్య కాలంలో కొన్ని పండగలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు మూసి ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండగా, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగగా, రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండనుంది. మొత్తం 7 విడతల్లో ఎన్నిలకు పోలింగ్‌ జరుగనుంది. ఇక మీరు మద్యం సేవించి, మహారాష్ట్రలో నివసిస్తుంటే, ఈ వార్త మిమ్మల్ని షాక్‌ ఇచ్చేలా ఉంటుంది. వాస్తవానికి మహారాష్ట్రలో వరుసగా 3 రోజులు డ్రై డే ఉండబోతోంది. ఈ వారం శనివారం నుంచి సోమవారం వరకు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. అటువంటి పరిస్థితిలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో నగరంలో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయబడతాయి. ఐదవ దశ ఓటింగ్‌కు ముందు ముంబై నగరంలో పరిపాలన మే 18 నుండి 20 వరకు డ్రై డేగా ప్రకటించింది.

దుకాణాలు ఎప్పుడు మూసి ఉంటాయి?

నివేదిక ప్రకారం.. మే 18 సాయంత్రం 5 గంటల నుండి ముంబై నగరంలో మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్నారు. దీని తరువాత అవి మే 19న రోజంతా మూసివేయబడతాయి. మే 20న సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఓపెన్‌ అవుతాయి. ఓటింగ్ రోజున అన్ని మద్యం దుకాణాలు, బార్లు రోజంతా మూసి ఉంటాయి. ఇది కాకుండా జూన్ 5న ఓట్ల లెక్కింపు సందర్భంగా ముంబైలో మళ్లీ డ్రై డే పాటించనున్నారు. ఏడాదిలో హోలీ, దీపావళి, గాంధీ జయంతి, ఆగస్టు 15, జనవరి 26 మహారాష్ట్రతో సహా మొత్తం దేశంలో అధికారికంగా మద్యం దుకాణాలు మూసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2022 సంవత్సరంతో పోల్చితే, 2023 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో థానే ప్రాంతంలో దాదాపు 80 లక్షల బల్క్ లీటర్ల బీర్ అమ్ముడైంది. థానే ప్రాంతంలో ముంబై నగరం, శివారు ప్రాంతాలు, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ ప్రకారం.. 2022 సంవత్సరంలో (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు) థానే ప్రాంతంలో 904.65 లక్షల బల్క్ లీటర్ల బీర్ విక్రయిస్తారు. 2023 సంవత్సరంలో (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు), 988.32 లక్షల బల్క్ లీటర్ల బీర్ అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

138 కోట్ల ఆదాయం పెరిగింది:

ముంబై సహా థానే రీజియన్‌లో మద్యం విక్రయాలు పెరగడంతో ప్రభుత్వ ఆదాయం కూడా రూ.138.38 కోట్లు పెరిగింది. గత ఏడాది ఆరు నెలల్లో మద్యం, బీర్ల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1719.16 కోట్ల ఆదాయం రాగా, 2023 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఆదాయం రూ.1857.54 కోట్లకు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి