
ఈ డిజిటల్ యుగంలో సౌకర్యాలు ఎన్ని పెరిగాయో అంతే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మోసగాళ్ల బారిన పడుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్, ఇతర మోసాల గురించి వారికి అవగాహన కల్పించే లక్ష్యంతో బ్యాంకులు క్రమం తప్పకుండా కస్టమర్లకు సలహాలు జారీ చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సీనియర్ సిటిజన్లు, పెన్షనర్ కస్టమర్లు, దాని మాజీ ఉద్యోగులతో సహా తన కస్టమర్లకు ఫోన్, వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చే మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఒక సలహా జారీ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాత సాధారణ మోసపూరిత పద్ధతుల గురించి సమాచారాన్ని కూడా పంచుకుంది, సైబర్ నేరాల నుండి తమను తాము రక్షించుకునే మార్గాలను కూడా తెలియజేసింది.
ఆన్లైన్లో చెలామణి అవుతున్న మోసపూరిత సందేశాలు, నకిలీ పెన్షనర్ కార్డ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లను, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను, పెన్షనర్లను కోరుతోంది. అటువంటి ఏదైనా కమ్యూనికేషన్ను దయచేసి అధికారిక బ్యాంక్ ఆఫ్ బరోడా ఛానెల్ల ద్వారా లేదా మీ సమీప శాఖను సందర్శించడం ద్వారా మాత్రమే ధృవీకరించండి అని బ్యాంక్ తెలిపింది. ముఖ్యంగా పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ మోసాల సంఘటనలు ఇటీవల పెరిగాయని బ్యాంక్ తెలిపింది. పెన్షనర్ కార్డ్ అని పిలవబడే దానికి సంబంధించిన నకిలీ సందేశాలు, చిత్రాలు సోషల్ మీడియా, వాట్సాప్లో ప్రసారం అవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా సోషల్ మీడియా లేదా లింక్ల ద్వారా ఎటువంటి కొత్త పెన్షనర్ కార్డును జారీ చేయలేదని పేర్కొంటూ రుణదాత తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యే ఏదైనా పెన్షనర్ కార్డు లేదా ఆఫర్కు బ్యాంక్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ BoB కొన్ని సాధారణ మోసపూరిత వ్యూహాలను వెల్లడించింది. అవి ఇలా ఉన్నాయి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి