Budget 2021: బడ్జెట్‌ రైతుకు ఊరటనిస్తుందా? ఆందోళనల దృష్ట్యా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం పెంచే అవకాశం!

| Edited By: Ram Naramaneni

Feb 01, 2021 | 11:32 AM

రైతులను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమచారం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం..

Budget 2021: బడ్జెట్‌ రైతుకు ఊరటనిస్తుందా? ఆందోళనల దృష్ట్యా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం పెంచే అవకాశం!
Follow us on

Agriculture Budget 2021: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెడుతోంది. అయితే రైతులను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమచారం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా కేంద్రం తొలిసారిగా ఏటా రూ. 6వేలను మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని చాలా కాలంగా రైతు సంఘాలు, నిపుణులు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సాయాన్ని పెంచితే రైతులకు మరింత లాభం చేకూరడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

రైతు సాయాన్ని పెంచాలని ఎవరెవరు సూచించారంటే..

  • వ్యవసాయ నిపుణుడు వినోద్ ఆనంద్ కేంద్రం ఇస్తున్న సబ్సిడీని నిలుపుదల చేసి రైతులకు నేరుగా ఏటా 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • కిషన్ శక్తి సంఘ్ అధ్యక్షుడు పుష్పేంద్ర సింగ్ కూడా ఈ సాయాన్ని నెలకు రూ .2000 కు చొప్పున అందించాలని కోరారు.
  • పీఎం కిసాన్ పథకం కింద ఏటా రూ.12000 ఇవ్వాలని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు.
  • స్వామినాథన్ ఫౌండేషన్ కూడా ఈ సాయాన్ని రూ .15 వేలకు పెంచాలని సూచించింది.
  • ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్‌ ఈ సాయాన్ని రూ.8వేలు చేయాలని సూచించారు.

పిఎం కిసాన్ సమ్మాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులందరికీ ఈ పథకం ద్వారా రూ.6000లను.. రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 11.52 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. దాదాపు ఏడు విడతల్లో ప్రభుత్వం నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. 2021-22 బడ్జేట్‌లో మోదీ ప్రభుత్వం ఈ సాయాన్ని మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Budget 2021 Live Streaming: నేడే కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను ఇలా వీక్షించండి..పూర్తి వివరాలు