సుప్రీంకోర్టు జడ్జిగా మహిళనే నియమిస్తా, ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మహిళనే తను నియమిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవలే మరణించారు. దీంతో ఆమె స్థానంలో తాను మహిళనే జడ్జిగా నియమిస్తామని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిగా మహిళనే నియమిస్తా, ట్రంప్

Edited By:

Updated on: Sep 20, 2020 | 12:42 PM

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మహిళనే తను నియమిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవలే మరణించారు. దీంతో ఆమె స్థానంలో తాను మహిళనే జడ్జిగా నియమిస్తామని ఆయన అన్నారు. గిన్స్ బెర్గ్ ఇచ్చిన తీర్పులు, న్యాయవ్యవస్థపట్ల ఆమెకు గల నిబధ్ధత, అంకితభావం, క్యాన్సర్ పై ఆమె జరిపిన పోరాటం అమెరికన్లందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆయన కోరారు. నార్త్ కెరొలినా లో జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన ట్రంప్…షికాగో లోని ‘అమీ కోనీ బారెట్’, అంట్లాంటాకు చెందిన’ బార్బరా లాగోవా’లలో ఒకరిని అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా నియమిస్తానని చెప్పారు.

కాగా-అమెరికా సుప్రీంకోర్టులో  27 ఏళ్లపాటు జడ్జిగా వ్యవహరించిన గిన్స్ బెర్గ్ ..గత శుక్రవారం క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us