తెలంగాణలో రేపటి నుంచి 33 జిల్లాలు

|

Feb 16, 2019 | 2:09 PM

హైదరాబాద్‌: తెలంగాణలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. రేపట్నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల […]

తెలంగాణలో రేపటి నుంచి 33 జిల్లాలు
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. రేపట్నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరనుంది. రెండు కొత్త జిల్లాలకు ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమించనున్నారు. అటు మరికొన్ని జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది.