ఎంపీ నందిగంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలకభేటీ

|

Sep 21, 2020 | 11:28 AM

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలు వివాదాలు వస్తున్న నేపధ్యంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్న సంకేతాలు ఇవ్వటమే ప్రధానంగా ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని వైసీపీ అధిష్టానం సూచించిన నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు […]

ఎంపీ నందిగంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలకభేటీ
Follow us on

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలు వివాదాలు వస్తున్న నేపధ్యంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్న సంకేతాలు ఇవ్వటమే ప్రధానంగా ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని వైసీపీ అధిష్టానం సూచించిన నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్టు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. అయితే, ఈ సమావేశంపై ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడకపోవడం విశేషం. ఇలాఉండగా, పోలీస్ అధికారిని బెదిరిస్తున్న ఆడియో ఎమ్మెల్యే శ్రీదేవి పేరుతో సర్క్యులేట్ అవుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన నా మనుషులను పంపిస్తావా? లేదా? అంటూ సీఐని బెదిరిస్తున్నట్లు ఆ క్లిప్పింగ్ లో ఉంది.