సర్జికల్ దాడిపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ వింత ఫిర్యాదు

| Edited By:

Mar 02, 2019 | 4:37 PM

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦, భారత‌ వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొ౦ది. పాక్ భూతలంలో ఉన్న బాలాకోట్‌లోకి ప్రవేశించిన ‘మిరాజ్ 2000’ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే…పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతూ, ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి […]

సర్జికల్ దాడిపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ వింత ఫిర్యాదు
Follow us on

పుల్వామా ఉగ్రదాడి అన౦తర౦, భారత‌ వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొ౦ది. పాక్ భూతలంలో ఉన్న బాలాకోట్‌లోకి ప్రవేశించిన ‘మిరాజ్ 2000’ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే…పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతూ, ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది.

భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లేలా ప్రవర్తి౦చాయని పేర్కొంది. పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి మాలిక్ అమిన్ అస్లం ‘రాయిటర్స్’ వార్తా సంస్థతో మాట్లాడుతూ…భారత వైమానిక దాడుల వల్ల తమ దేశంలోని పర్యావరణంపై పడిన దుష్ప్రభావం గురి౦చి ఐక్యరాజ్య సమితి తదితర పర్యావరణ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాయిటర్స్ ప్రతినిధులు బాంబు దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ 15 పైన్ చెట్లు కుప్పకూలినట్లు కనుగొన్నారు.