పారికర్‌కు మరింత ముదిరిన క్యాన్సర్

| Edited By:

Mar 04, 2019 | 9:22 AM

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమైందని ఆ రాష్ట్ర మంత్రి విజై సర్దేశాయ్ వెల్లడించారు. క్లోమగ్రంధి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన పలుచోట్ల చికిత్స తీసుకున్నారు. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో.. గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాధి మరింతగా ముదిరి, తీవ్ర దశకు చేరుకుందని సర్దేశాయ్ వెల్లడించారు. కాగా పారికర్ ఆరోగ్యం క్షీణించిందని గత కొన్ని రోజులుగా వార్తలు […]

పారికర్‌కు మరింత ముదిరిన క్యాన్సర్
Follow us on

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమైందని ఆ రాష్ట్ర మంత్రి విజై సర్దేశాయ్ వెల్లడించారు. క్లోమగ్రంధి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన పలుచోట్ల చికిత్స తీసుకున్నారు. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో.. గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాధి మరింతగా ముదిరి, తీవ్ర దశకు చేరుకుందని సర్దేశాయ్ వెల్లడించారు. కాగా పారికర్ ఆరోగ్యం క్షీణించిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.