కేరళ విమాన ప్రమాదం, ఢిల్లీకి కో-పైలట్ మృతదేహం తరలింపు

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది.

కేరళ విమాన ప్రమాదం, ఢిల్లీకి కో-పైలట్ మృతదేహం తరలింపు

Edited By:

Updated on: Aug 09, 2020 | 1:56 PM

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఢిల్లీకి తరలించారు. కోచ్చి నుంచి ఆయన భౌతికకాయం ఈ తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కి  చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం అఖిలేష్  మృతదేహాన్ని యూపీలోని ఆయన సొంత ప్రాంతమైన మధురకు తరలించనున్నారు.

తాము చివరిసారి అఖిలేష్ కుమార్ తో రక్షాబంధన్ రోజున వీడియో కాల్ ద్వారా మాట్లాడామని, ఆయన ఈ  నెల 15, 16 తేదీల్లో ఇంటికి రావాల్సి ఉందని., కానీ భగవంతుడు మరోలా తలిచాడని ఆయన బావ గద్గద స్వరంతో చెప్పారు. కేరళ విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అనేకమంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us