దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు.