సరిహద్దులో యుద్ధ ట్యాంకులు మోహరించిన పాక్

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:18 PM

న్యూఢిల్లీ: భారత్‌తో యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధమౌతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ బోర్డర్ వద్దకు యుద్ధ ట్యాంకర్లను తరలిస్తోంది. దీంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలను పంపిస్తోంది. ఒకవైపు భారత్ యుద్ధం చేసేలా ఉందంటూ పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితికి లేఖ ఇచ్చారు. మరోవైపు భారత్ ఏం చేయకుండానే సరిహద్దుల్లో పాక్ రెచ్చగొడుతోంది. భారత్ దాడి చేస్తే తప్పకుండా తిప్పి కొడతామని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఇది సన్నాహక చర్యలుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే […]

సరిహద్దులో యుద్ధ ట్యాంకులు మోహరించిన పాక్
Follow us on

న్యూఢిల్లీ: భారత్‌తో యుద్ధానికి పాకిస్థాన్ సిద్ధమౌతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ బోర్డర్ వద్దకు యుద్ధ ట్యాంకర్లను తరలిస్తోంది. దీంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలను పంపిస్తోంది. ఒకవైపు భారత్ యుద్ధం చేసేలా ఉందంటూ పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితికి లేఖ ఇచ్చారు. మరోవైపు భారత్ ఏం చేయకుండానే సరిహద్దుల్లో పాక్ రెచ్చగొడుతోంది. భారత్ దాడి చేస్తే తప్పకుండా తిప్పి కొడతామని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఇది సన్నాహక చర్యలుగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌పై భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగడం కాకుండా పరోక్ష యుద్ధాం చేస్తోంది. పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచింది. 23 ఏళ్ల క్రితం పాక్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం హోదాను ఉపసంహరించుకుంది. సింధూ జలాలను పాక్‌కు వదలకుండా కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాకలు తరలించింది. అంతేకాదు బియాస్, సట్లేజ్ నదీ జలాలను కూడా భారత్ మళ్లించింది. అంతర్జాతీయంగా అన్ని దేశాల మద్దతు కూడగడుతూ పాక్‌ను ఒంటరి చేసేందుకు కృషి చేస్తోంది.