పాత వీడియో షేర్ చేసి విమర్శల పాలైన పాక్

| Edited By:

Mar 06, 2019 | 4:49 PM

పాకిస్థాన్‌ వక్రబుద్ధి మరోసారి సోషల్ మీడియా వేదికగా బయటపడింది. భారత్‌పై బురద జల్లే ప్రయత్నంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాకిస్థాన్. ఆ వీడియో పాతది అని తేల్చేయడంతో మరోసారి విమర్శల పాలైంది. భారత్‌కు చెందిన ఓ సబ్‌మెరైన్ తమ సముద్రజలాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిందని, దాన్ని తాము తిప్పికొట్టామని చెబుతూ 50సెకన్లు కలిగిన ఓ వీడియోను సోమవారం పాక్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఆ దేశానికి చెందిన […]

పాత వీడియో షేర్ చేసి విమర్శల పాలైన పాక్
Follow us on

పాకిస్థాన్‌ వక్రబుద్ధి మరోసారి సోషల్ మీడియా వేదికగా బయటపడింది. భారత్‌పై బురద జల్లే ప్రయత్నంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాకిస్థాన్. ఆ వీడియో పాతది అని తేల్చేయడంతో మరోసారి విమర్శల పాలైంది.

భారత్‌కు చెందిన ఓ సబ్‌మెరైన్ తమ సముద్రజలాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిందని, దాన్ని తాము తిప్పికొట్టామని చెబుతూ 50సెకన్లు కలిగిన ఓ వీడియోను సోమవారం పాక్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఆ దేశానికి చెందిన ఓ నేవీ అధికారి.. ‘‘పాకిస్థాన్ నేవీ అధికారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి భారత సబ్‌మెరైన్‌ను తమ జలాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. శాంతి ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్‌మెరైన్‌ను తాము ఏమీ చేయలేదు. దీన్ని చూసైనా భారత్ బుద్దిని మార్చుకొని శాంతి మార్గంలో పయనించాలి’’ అంటూ పేర్కొన్నారు.

అయితే దీనిపై స్పందించిన భారత అధికారులు అది పాత వీడియో అని తేల్చేశారు. అబద్ధపు ఆరోపణలు చేసి పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించిందంటూ భారత అధికారులు మండిపడ్డారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాక్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వీడియోలను వేలల్లో తయారు చేసి పాక్‌పై తాము కూడా ఆరోపణలు చేయగలం అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా పాకిస్థాన్ షేర్ చేసిన ఆ వీడియో 2016 సంవత్సరంలోనిది.