తోపు పైలట్.. మొక్కజొన్న చేనులో విమానం ల్యాండ్ చేశాడు

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్‌ 321 విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో  సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు.  విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి  ప్రాణ నష్టం జరగలేదు. యురల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం […]

తోపు పైలట్.. మొక్కజొన్న చేనులో విమానం ల్యాండ్ చేశాడు
"Hero" Pilot Lands Plane In Corn Field

Updated on: Aug 15, 2019 | 3:38 PM

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌బస్‌ 321 విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో  సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు.  విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి  ప్రాణ నష్టం జరగలేదు. యురల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పైలట్‌ సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. హుకోవ్‌స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఈఘటన చోటు చేసుకుంది. అయితే విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందో వివరాలు తెలియరాలేదు.  క్షేమంగా ల్యాండవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us