భారత్లో కరోనావైరస్ విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుంది. గత 24 గంటల్లో 27 మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. కొత్తగా 915 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 500 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వివరాలు వెల్లడించింది.
మొత్తం కేసులు: 15,707
యాక్టివ్ కేసులు: 12,969
మరణాలు: 507
కోలుకున్నవారు: 2,231