
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కంటికి కనిపించిన వారినల్లా పట్టేసుకుంటుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా, వీళ్లు వాళ్లు అనే భేదం లేకుండా అంటుకుంటోంది. తాజాగా దేశ భద్రతా సైనికులకు సైతం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 110 మంది ఆర్మీ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గత రెండు మూడు రోజుల్లోనే 100 మందికి కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో తేలిందన్నారు. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు. అధికారులు. ఆర్మీ సిబ్బంది ఏయే ప్రాంతాలకు వెళ్లారనేది అధికారిక రికార్డుల ప్రకారం ఆరా తీస్తున్నారు. కొవిడ్ సోకిన ఆర్మీ సిబ్బందికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరోనా బారినపడిన వారిని క్వారంటైన్ తరలించి ఆర్మీ ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు. అటు, ఉత్తరాఖండ్లో ఇప్పటివరకూ 4,102 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా. ఇప్పటి వరకు 18 మంది కరోనా బారినపడి చనిపోయారు. ప్రస్తుతం 1,030 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు.