బ్రేకింగ్.. ఎయిరిండియా.. ఈ నెల 30 వరకు బుకింగ్స్ నిలిపివేత ?

ఈ నెల 30 వరకు బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 14 తరువాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిన అనంతరం.. యాజమాన్యం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ఈ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

బ్రేకింగ్.. ఎయిరిండియా.. ఈ నెల 30 వరకు బుకింగ్స్ నిలిపివేత ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 04, 2020 | 1:25 PM

ఈ నెల 30 వరకు బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 14 తరువాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిన అనంతరం.. యాజమాన్యం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ఈ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ రూట్లకు సంబంధించి బుకింగులను నిలిపివేసినట్టు ఆయన చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 14 వరకు దేశంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ నెల 14 తరువాత ఏ తేదీకైనా టికెట్ బుకింగ్స్ ని ఎయిర్ లైన్స్ తీసుకోవచ్చునని పౌర విమాన యాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. దీంతో.. ఎయిరిండియా ప్రకటనపై అయోమయం నెలకొంది.