సమావేశంలో బురద చల్లిన బీజేపీ కౌన్సిలర్
ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో హైడ్రామా చోటుచేసుకుంది. రాయ్పూర్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నానా హంగామా చేశారు. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. ఇక బీజేపీకి చెందిన మనోజ్ ప్రజాపతి అనే కౌన్సిలర్ చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది. ఓ ప్యాకెట్లో బురదను తీసుకొచ్చి హాల్లో చల్లాడు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమావేశంలో పోటీ పడి […]
ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో హైడ్రామా చోటుచేసుకుంది. రాయ్పూర్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నానా హంగామా చేశారు. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. ఇక బీజేపీకి చెందిన మనోజ్ ప్రజాపతి అనే కౌన్సిలర్ చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది. ఓ ప్యాకెట్లో బురదను తీసుకొచ్చి హాల్లో చల్లాడు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది.
కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమావేశంలో పోటీ పడి నినాదాలు చేశారు. బీజేపీ కౌన్సిలర్ల తీరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బురదను శుభ్రం చేసి నిరసన తెలిపారు.
#WATCH Raipur: BJP Corporator, Manoj Prajapati, dumps sludge in the House as a mark of protest against Municipal Corporation, alleging that the Corporation is not working efficiently in his area. #Chhattisgarh pic.twitter.com/vlGVGLEq5V
— ANI (@ANI) July 2, 2019