హౌస్ లో రక్షాబంధన్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన పునర్నవి..

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2019 | 9:40 AM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం చివరికి చేరుకుంది. అల్లర్లు, గొడవలు, కాస్త ఎంజాయ్ మెంట్ అలా సాగుతోంది. మొత్తానికి బిగ్ ఇంటి సభ్యులు చేస్తున్న సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. ముందు వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్‌ల మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు […]

హౌస్ లో రక్షాబంధన్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన పునర్నవి..
Follow us on

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం చివరికి చేరుకుంది. అల్లర్లు, గొడవలు, కాస్త ఎంజాయ్ మెంట్ అలా సాగుతోంది. మొత్తానికి బిగ్ ఇంటి సభ్యులు చేస్తున్న సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. ముందు వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్‌ల మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు లీటర్ల నూనె ఇచ్చారు అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది శ్రీముఖి. ఇక డైనింగ్ టేబుల్‌ మీద వితికాతో పాటు రాహుల్-పునర్నవిలు ఒకే ప్లేట్‌లో తింటూ ముచ్చట్లు పెట్టారు. ఇక పునర్నవి.. రాహుల్ తినిపించడంతో మిమ్మల్ని ఇలా చూస్తే మీకు పెళ్లి అవ్వదు అంటూ చురక అంటించింది వితికా షెరు. అయితే ఏ.. తినిపిస్తే తప్పా పెళ్లి కాకపోతే ఏం.. అంటూ కొసరి కొసరి రాహుల్‌కి తినిపించింది పునర్నవి. ఇక రక్షా బంధన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు జరిగాయి. కంటెస్టెంట్స్‌కి వాళ్ల ఇంటి దగ్గర నుండి పంపించిన రాఖీలు హౌస్‌లో ఉన్న వాళ్లతో కట్టించుకుని ఎమోషన్ అయ్యారు. తొలుత వరుణ్ సందేశ్‌కి హిమజ రాఖీ కట్టగా.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టింది. అయితే శ్రీముఖి మాత్రం మా తమ్ముడు పంపించిన రాఖీని ఎవరితోనూ షేర్ చేసుకోలేను అంటూ బాబా భాస్కర్ మాస్టర్‌తో కట్టించుకుంది. ఇక పునర్నవి వంతు వచ్చింది. హౌస్ లో ఉన్నవాళ్లందరికి రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప అంటూ రాహుల్ లైన్‌లోకి వచ్చినట్లుగా ఇన్ డైరెక్టుగా చెప్పింది. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్‌తో రాహుల్-పునర్నవిల లవ్ ట్రాక్ మెల్లగా పట్టలెక్కింది.