బిగ్ బాస్: టఫ్ ఎలిమినేషన్ వార్‌.. మంచోడికే ఎగ్జిట్ డోర్?

|

Sep 24, 2019 | 1:01 PM

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 9 మంది సభ్యులు మిగిలారు. ఆదివారం హిమజ ఎలిమినేట్ కావడం..  ఫేక్ ఎలిమినేషన్ ద్వారా ఎగ్జిట్ అయిన రాహుల్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడం జరిగింది. ఇక ఈ తొమ్మిది మంది మధ్య సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా కెప్టెన్ మహేష్ విట్టా మినహా మిగిలిన ఇంటి సభ్యులు జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి – రవి-వితికా – వరుణ్-రాహుల్ – బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా […]

బిగ్ బాస్: టఫ్ ఎలిమినేషన్ వార్‌.. మంచోడికే ఎగ్జిట్ డోర్?
Follow us on

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 9 మంది సభ్యులు మిగిలారు. ఆదివారం హిమజ ఎలిమినేట్ కావడం..  ఫేక్ ఎలిమినేషన్ ద్వారా ఎగ్జిట్ అయిన రాహుల్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడం జరిగింది. ఇక ఈ తొమ్మిది మంది మధ్య సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా కెప్టెన్ మహేష్ విట్టా మినహా మిగిలిన ఇంటి సభ్యులు జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి – రవి-వితికా – వరుణ్-రాహుల్ – బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా పెట్టి…వారిలో ఎవరికి ఇంట్లో ఉండటానికి అర్హతలు ఉన్నాయో – గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాదించుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.

దీనితో జంటలు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొదటగా శివజ్యోతి-శ్రీముఖిలు మొదలుపెట్టగా.. ఇంట్లో ఉన్న మిగతా సభ్యుల ఓట్లు ఎక్కువగా జ్యోతికి రావడంతో.. శ్రీముఖి ఎలిమినేషన్‌ లోకి వెళ్ళింది. అనంతరం వితికా-రవిలా మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా.. హౌస్‌మేట్స్ ఓట్లు ఎక్కువ శాతం వితికాను వరించగా ఆమె సేవ్ అయ్యి.. రవికృష్ణ ఎలిమినేషన్‌లోకి వెళ్ళాడు.

ఇక మూడో జోడిగా వచ్చిన రాహుల్-వరుణ్‌లు ఎక్కువగా వాగ్వాదానికి దిగలేదు. కూల్‌గా ఇద్దరూ చర్చించుకున్నారు. అయితే చివరికి రాహుల్‌కి ఎక్కువ ఓటింగ్ నమోదు కావడంతో.. వరుణ్ నామినేషన్‌కు వెళ్ళాడు. చివరిగా వచ్చిన పునర్నవి- బాబా భాస్కర్‌‌‌‌ల జోడి మధ్య మాత్రం చర్చ వాడీవేడిగా జరిగింది. బాబా గేమ్ ఆడటం లేదని.. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం చేస్తున్నారని పునర్నవి కామెంట్స్ చేయగా.. బాబా భాస్కర్ మాత్రం కూల్‌గా పున్నుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఆ తర్వాత ఓటింగ్‌లో పునర్నవికి నాలుగు ఓట్లు.. బాబాకు మూడు ఓట్లు రావడంతో.. బాబా భాస్కర్ ఎలిమినేషన్ జోన్‌కు వెళ్లారు.

చివరికి పదో వారం ఎలిమినేషన్ జోన్‌లో దాదాపు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటం గమనార్హం. శ్రీముఖి – రవి – వరుణ్ – బాబా భాస్కర్‌లు నామినేట్ అవ్వగా.. వీరందరికి బయట ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పవచ్చు. అందువల్ల ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ టఫ్‌గా జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఓటింగ్ బట్టి చూస్తుంటే మంచోడు రవికృష్ణకు అందరి కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఒక్క రోజు మాత్రమే గడవడంతో.. వీకెండ్ వచ్చేసరికి ఏ పరిణామమైన జరగొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.