ఇసుక సమస్యకు సత్వర పరిష్కారాలు ఏంటి?..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్

ఏపీ ఇసుకపై రాజకీయ పంచాయితీ కాకరేపుతోంది. విపక్షాలు ఈటెల్లాంటి ప్రశ్నలతో సమరానికి సై అంటుంటే, ప్రభుత్వం వారోత్సవాలకు రెడీ అవుతోంది. అధికారపార్టీ నేతలు ఇసుక కొరత సృష్టించారన్న టీడీపీ పాత విమర్శకు- వైసీపీ కొత్త కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ మాఫియా గ్రామాల్లోకి ఇసుక రాకుండా అడ్డుకుంటోందన్నది అధికారపార్టీ ఆరోపణ. భవన నిర్మాణ కార్మికుల గురించి విపక్షాలు గొంతెత్తుతుంటే, ఆ నిధుల్ని టీడీపీ సర్కార్‌ దారిమళ్లించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక కొరతపై ఇప్పటికే టీడీపీ, సీపీఐలు పోరాటం సాగిస్తూ […]

ఇసుక సమస్యకు సత్వర పరిష్కారాలు ఏంటి?..బిగ్ న్యూస్..బిగ్ డిబేట్
Follow us

|

Updated on: Oct 30, 2019 | 11:33 PM

ఏపీ ఇసుకపై రాజకీయ పంచాయితీ కాకరేపుతోంది. విపక్షాలు ఈటెల్లాంటి ప్రశ్నలతో సమరానికి సై అంటుంటే, ప్రభుత్వం వారోత్సవాలకు రెడీ అవుతోంది. అధికారపార్టీ నేతలు ఇసుక కొరత సృష్టించారన్న టీడీపీ పాత విమర్శకు- వైసీపీ కొత్త కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ మాఫియా గ్రామాల్లోకి ఇసుక రాకుండా అడ్డుకుంటోందన్నది అధికారపార్టీ ఆరోపణ. భవన నిర్మాణ కార్మికుల గురించి విపక్షాలు గొంతెత్తుతుంటే, ఆ నిధుల్ని టీడీపీ సర్కార్‌ దారిమళ్లించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక కొరతపై ఇప్పటికే టీడీపీ, సీపీఐలు పోరాటం సాగిస్తూ ఉండగా..జనసేన, బీజేపీలు త్వరలోనే నిరసన దీక్షలకు దిగబోతున్నాయి. ఇక ఇదే ఇష్యూపై టీవీ9 బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది. దాంట్లో ఇసుక కొరతకు సత్వర పరిష్కారాలకు సంబంధించి ఏపీలోకి విపక్ష పార్టీలకు చెందిన నాయకులు కొన్ని పరిష్కారాలు సూచించారు. వాటిపై అధికారపార్టీ ఏ విధంగా స్పందించిందనే విషయాలు దిగువ వీడియోలో..

;