హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కు ‘ భారతరత్న ‘ పురస్కారాన్ని ప్రకటించాలన్న బీజేపీ డిమాండుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. తన ట్విటర్ లో ఆమె కమలం పార్టీ పై ధ్వజమెత్తారు. అత్యాచారాన్ని సమర్థించిన వ్యక్తికి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. గాంధీజీ వంటి గొప్ప వ్యక్తులను ఈ దేశం అగౌరవపరుస్తోందని, కానీ సావర్కర్ లాంటి వారిపట్ల ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయంటే ఈ వ్యవస్థ తన విలువలను నైతికంగా సంస్కరించుకోవలసిందేనని ఆమె పేర్కొన్నారు. ‘ ఒక రాజకీయ ఆయుధంగా రేప్ ను వినియోగించుకోవాలని ‘ సావర్కర్ నాడు తన పుస్తకంలో షాకింగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు భారత రత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నప్పుడు గాంధీజీ హంతకుడు నాథూరామ్ గాడ్సే కి కూడా ఇవ్వాలని ఎందుకు కోరడంలేదని కాంగ్రెస్, ఎంఐఎం వంటి విపక్షాలు సెటైర్ వేస్తున్నాయి. ఈ నెల 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ.. తన మేనిఫెస్టోలో సావర్కర్ కు, 19 వ శతాబ్దపు జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రి భాయ్ ఫూలే లకు కూడా ఈ అవార్డును ఇవ్వాలన్న డిమాండును లేవనెత్తింది. సావర్కర్ కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలన్న వాదనపై అప్పుడే దుమారం రేగుతోంది.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.
రేప్ను సమర్థించిన సావర్కర్కా ‘భారతరత్న ‘ ? మెహబూబా ముఫ్తీ
- Posted October 17, 2019
- 2:40 pm
- IST
