Vastu Tips: మట్టికుండలో నీళ్లు నింపి ఈ దిక్కులో ఉంచితే మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది…

|

Dec 06, 2022 | 1:54 PM

ముఖ్యంగా ఎండాకాలంలో ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో ఇలాంటి మట్టి కుండలు వాడుతుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిలా ఉంటే, మట్టి కుండలో నీళ్లు పోసి ఏ దిక్కు వైపు ఉంచాలి..?, ఏ దిక్కు వైపు ఉంటే మనకు మంచి జరుగుతుంది..

Vastu Tips: మట్టికుండలో నీళ్లు నింపి ఈ దిక్కులో ఉంచితే మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది...
Vastu Tips
Follow us on

వాస్తు చిట్కాలు:  ఇంట్లో శాంతి, సంపద, ప్రేమానురాగాల కోసం చాలా మంది ప్రజలు వాస్తును పాటిస్తుంటారు. జ్యోతిశాస్త్ర నిపుణుల సూచనల మేరకు ఆయా నియమాలు పాటిస్తుంటారు. అందులో భాగంగా ఇంటి ఏ దిక్కున ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో కూడా వాస్తు ప్రకారం అనుసరిస్తుంటారు. ధనలాభం, పాజిటివిటీ కోసం ఇంట్లో మట్టి కుండలో నీటిని నింపి పెట్టుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఏ దిక్కు వైపు మట్టి కుండని నీటితో నింపి ఉంచాలి అన్నది ఇక్కడ తెలుసుకుందాం…

చాలా మంది ఇళ్లల్లో మట్టి కుండ లో నీళ్లు పోసి ఆ నీటిని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో ఇలాంటి మట్టి కుండలు వాడుతుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిలా ఉంటే, మట్టి కుండలో నీళ్లు పోసి ఏ దిక్కు వైపు ఉంచాలి..?, ఏ దిక్కు వైపు ఉంటే మనకు మంచి జరుగుతుంది.. అన్న విషయానికి వస్తే..వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసులో లేదా ఇంట్లో ఈ మట్టికుండలో నీళ్లు నింపి ఉత్తర దిక్కున ఉంచాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరదిశ 5 మూలకాల లోని నీటి మూలకానికి సంబంధించినది. అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం. ఇటువంటి సందర్భం లో ఉత్తర దిక్కు వైపు మట్టి కుండని ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు. పైగా ఇది పాజిటివిటీని కూడా పెంపొందిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరమవుతుంది. ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. కాబట్టి తప్పక ఈ పద్ధతిని పాటించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి