వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి: వైవీ సుబ్బారెడ్డి

| Edited By:

Jul 19, 2020 | 7:16 AM

తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి: వైవీ సుబ్బారెడ్డి
Follow us on

తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాల పర్యవేక్షకులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వారిని తరలించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఇక స్వామి వారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై సమీక్ష జరుపుతున్నట్లు ఆయన వివరించారు. కాగా టీటీడీలో పలువురు అర్చకులకు కరోనా సోకగా.. దర్శనాలను నిలిపివేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది.