IPhone: ఏంటి బ్రో ఇలా చేశావ్.. బతికుంటే ఎన్ని ఐఫోన్‌లైనా కొనొచ్చు.. కడుపుకోతను తీర్చేదెవరు..?

విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తండ్రి ఐఫోన్‌ కొనివ్వలేదనే మనస్తాపంలో ఒక యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరనానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

IPhone: ఏంటి బ్రో ఇలా చేశావ్.. బతికుంటే ఎన్ని ఐఫోన్‌లైనా కొనొచ్చు.. కడుపుకోతను తీర్చేదెవరు..?
Vizag Tragedy

Updated on: Sep 22, 2025 | 11:41 AM

ఈ మధ్య ఎవడూ చూసిన ఐఫోన్, ఐఫోన్ అంటున్నారు. దాన్ని కొనేందుకు తెగ ఎడబడుతున్నారు. ఐఫోన్‌ ఉంటే అదో పెద్ద స్టేటస్‌లా ఫీల్‌ అవుతున్నారు. ఇక యూత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. కొందరై అప్పులు చేసి మరీ ఐఫోన్‌ కొంటుంటే మరి కొందరు.. ఇంట్లో వాళ్లను వేధించి, ఇప్పించక పోతే బ్లాక్‌ చనిపోతామని బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ దాన్ని సొంత చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లు ఐఫోన్ కొనివ్వలేదని ఒక యువకుడు ఏకంగా ప్రాణాలనే తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని బలవన్మరనానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సుజాతానగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి సాయి మారుతి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ జీవనం సాగించేవాడు. కొడుకు సాయి హైదరాబాద్‌లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేసేవాడు. అయితే సాయి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి సాయి తనకు ఐఫోన్‌ ఇప్పించాలని తండ్రిని అడగడం స్టార్ట్‌ చేశాడు.

ఈ విషయంపై తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎంత అడిగినా ఇంట్లో వాళ్లు ఫోన్‌ ఇప్పించట్లేదని మనస్తాపంలో సాయి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన గదిలోకి వెళ్లి రూమ్‌ లాక్‌ చేసుకున్నాడు. సాయంత్రం అయినా సాయి రూమ్‌లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పేరెంట్స్‌ తలుపు పగలగొట్టి చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి షాక్‌ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.