Visakhapatnam: తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువతి, యువకుడు మృతి..

|

Dec 08, 2021 | 9:15 AM

Visakhapatnam Road Accident: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు మృతిచెందారు. బైక్ పై వెళుతుండగా

Visakhapatnam: తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువతి, యువకుడు మృతి..
Road Road Accident
Follow us on

Visakhapatnam Road Accident: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు మృతిచెందారు. బైక్ పై వెళుతుండగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. బైక్ అదుపు తప్పి ఢీవైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. మృతులను జయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సెలూన్ బాయ్ ప్రశాంత్‌ (22), మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిగా (17)గా గుర్తించారు. ప్రశాంత్ యువతితో కలిసి బైక్‌పై మంగళవారం సాయంత్రం ఆశీల్ మెట్ట నుండి కంచరపాలెం వైపు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

మరో ప్రమాదం..
తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై మరో ప్రమాదం కూడా చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కారును మరో కారు ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో యువకుడు కారు డ్రైవ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Andhra Pradesh: ఎంపీడీవోను దూషించిన వైసీపీ నాయకుడు అరెస్ట్.. మరో ముగ్గురిపై కేసు..

Musheerabad water tank: అసాంఘిక కలాపాలకు అడ్డాగా వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం.. డెడ్‌ బాడీతో వెలుగులోకి కొత్త కోణాలు