Vizag: మిస్సింగ్ సస్పెన్స్ వీడింది.. ఆమె చేసిన పనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చైందో తెలిస్తే షాక్

|

Jul 27, 2022 | 7:40 PM

ఆర్కే బీచ్‌ వద్ద 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత సాయి ప్రియ వ్యవహారంలో ఊహించని టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయినట్లు పోలీసులకు సమాచారం అందింది.

Vizag: మిస్సింగ్ సస్పెన్స్ వీడింది.. ఆమె చేసిన పనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చైందో తెలిస్తే షాక్
Vizag Beach Missing Lady
Follow us on

Andhra Pradesh: విశాఖ ఆర్కే బీచ్‌(RK Beach)లో వివాహిత మిస్సింగ్ సస్పెన్స్‌ వీడింది. ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడుతున్న భర్త కన్నుగప్పి ప్రియుడి రవితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. సాయిప్రియ.. ప్రియుడు రవితో కలిసి నెల్లూరు(Nellore)లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రెండ్రోజులపాటు రాష్ట్రప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన సాయిప్రియ మిస్సింగ్‌ కథ సుఖాంతమైంది. పెళ్లికి ముందే రవి అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం నడిపిన సాయిప్రియ.. అదనుకోసం చూసింది. ఈ నెల 25న రెండో పెళ్లిరోజు కావడంతో భర్తకు మాయమాటలు చెప్పింది. సరదాగా బీచ్‌కు వెళ్దామంటూ నమ్మించింది. ప్రేమతో అడిగిన భార్య మాటను కాదనలేక.. పెళ్లి రోజుకూడా కావడంతో వెంటనే ఓకే చెప్పేశాడు భర్త. అప్పటికే ప్లాన్‌ చేసుకున్నారో ఏమో తెలియదు గానీ.. భర్త ఫోన్‌లో ఏమరుపాటుగా ఉండే క్షణం కోసం ఎదురుచూసింది. ఆ క్షణం రానేవచ్చింది. భర్తను ఏమార్చింది. ఎంచక్కా ప్రియుడితో కలిసి నెల్లూరు చెక్కేసింది. నెల్లూరులో ఉన్న సాయిప్రియను విశాఖకు తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు విశాఖ డిప్యూటీ మేయర్‌ శ్రీధర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సాయి ప్రియ ప్రియుడితో కలిసి నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. తాను బెంగళూరు ఉన్నట్లు సాయి ప్రియ తల్లిదండ్రులకు మెసేజ్ పంపింది. తాను ప్రియుడ్ని పెళ్లాడనని.. తన గురించి వెతకవద్దని.. ఆమె సందేశం పంపినట్లు తెలుస్తోంది.

గాలింపునకు ఎంత ఖర్చైందో తెల్సా..?

సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త తెలిపిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆమె ఆచూకి కోసం స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు.  స్పీడ్‌ బోట్లతో పాటు పైనుంచి గాలించేందుకు నేవీ హెలికాప్టర్‌ కూడా వినియోగించారు. సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అందరూ తమ పనులు వాయిదా వేసి మరీ.. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మొత్తంగా ఆమె ఆచూకి కోసం 85 లక్షల నుంచి కోటి మధ్య ఖర్చు చేశామని విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ వెల్లడించారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెజాగ్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..