Vizag: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నాడు. వేద పండితులు అప్పన్న స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. విరాట్‌ కోహ్లీ రాకతో సింహాద్రి అప్పన్న ఆలయంలో సందడి నెలకొంది. శనివారం జరిగిన విశాఖ వన్డేలో కోహ్లీ మంచి ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Vizag: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
Virat Kohli At Simhachalam

Updated on: Dec 07, 2025 | 12:08 PM

ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందింది.  సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.  కోహ్లీ రాక సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. దర్శనం తర్వాత ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు కోహ్లీ. తర్వాత పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు. కోహ్లీ రాకతో ఆలయంలో సందడి నెలకుంది. శనివారం విశాఖలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టి సిరీస్‌ను సొంతం చేసుకుంది. సౌతఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ..ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌‌గా నిలిచాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us