YS Jagan: అప్పట్లో వైయస్సార్.. ఇప్పుడు జగన్.. ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం హామీ..
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం సీఎం జగన్ను కలిశారు. కిడ్నీ బాధిత కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. కిడ్నీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ను కలవడం సంతోషంగా ఉందన్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు..
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం సీఎం జగన్ను కలిశారు. కిడ్నీ బాధిత కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. కిడ్నీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ను కలవడం సంతోషంగా ఉందన్నారు ఉద్దానం కిడ్నీ బాధితులు.. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులను ఆదుకోవాలని కోరామన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులకు మందుల కోసం నెలకు 12వేలు ఖర్చు అవుతుదని సీఎం జగన్కు చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న 5వేల పెన్షన్తోపాటు.. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులకు మందులు కూడా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు కిడ్నీ బాధిత కుటుంబం. కిడ్నీ బాధితులను గతంలో వైయస్సార్.. ఇప్పుడు సీఎం జగన్ ఆదుకుంటున్నారన్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితుడు. జగన్ అధికారంలోకి వచ్చాకే కిడ్నీ బాధితులకు రూ.5వేలు పెన్షన్ ఇస్తున్నారని.. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలోనే మందులు కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపారన్నారు ఉద్దానం బాధితులు..
సీఎం జగన్ వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. మోదవలస దగ్గర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జిల్లా ఎంట్రన్స్లో సీఎం జగన్ -బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు వైఎస్సార్సీపీ నేతలు.. ఏపీ సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు వైసీపీ శ్రేణులు.ఇప్పటి వరకు బస్సు యాత్ర 2 వేల కిలోమీటర్ల మేర కొనసాగిందన్నారు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని, జగన్ బస్సు యాత్ర దేశంలోనే ఒక చరిత్ర అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..