
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అలర్ట్ జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, వాటికి గల కారణాలను టీటీడీ విడుదల చేసింది.
బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే
సిఫార్సు లేఖలు స్వీకరించబడవు
పైన పేర్కొన్న పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిర్దేశిత రోజులకు ముందు రోజు తిరుమలలో ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోరని అధికారులు వెల్లడించారు. కావున, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ కోరింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.