PM Modi Bhimavaram Visit Highlights: అల్లూరి నడయాడిన ఈ పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రధాని మోడీ

| Edited By: Anil kumar poka

Updated on: Jul 04, 2022 | 2:38 PM

Alluri Sita Rama Raju Statue Inauguration Highlights: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నేడు  ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi). భీమవరంలో జరగనున్న..

PM Modi Bhimavaram Visit Highlights: అల్లూరి నడయాడిన ఈ పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నా: ప్రధాని మోడీ
Pm Modi Ap Visit

Alluri Sita Rama Raju Statue Inauguration Highlights: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నేడు  ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi). భీమవరంలో జరగనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభకు మోడీ హాజరుకానున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2022 12:15 PM (IST)

    ఏపీలో ఎందరో స్వాత్రంత్ర్య వీరులు..

    • పింగళి వెంకయ్య, కందూకురి వీరేశలింగం, ప్రకాశం పంతులు ఏపీవారే..
    • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్‌ వారిని ఎదిరించి పోరాడారు..
    • స్వాతంత్ర్య సంగ్రామ మూలాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
    • ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలు నిర్వహిస్తాం
    • ఆదీవాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది.
    • భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం..

    ప్రధాని ప్రసంగంలోని మరిన్ని విశేషాలను ఈ కింది వీడియోలో చూడండి..

  • 04 Jul 2022 12:09 PM (IST)

    ప్రధాని మోడీ ప్రసంగం హైలెట్స్‌..

    • స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి కోసమే ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు..
    • ఈ వేడుకలను ఏడాది పాటు నిర్వహించుకోవాలి
    • త్యాగధనులను నిరంతరం స్మరించుకోవాలి.
    • వీరుల స్ఫూర్తితో యువకుడు దేశాభివృద్ధికి నడుం బిగించాలి.
  • 04 Jul 2022 12:05 PM (IST)

    ప్రధాని మోడీ ప్రసంగం హైలెట్స్‌..

    • అల్లూరి నడయాడిన ఈ పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నా
    • అల్లూరి జీవితం యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకం
    • ఆదివాసుల శౌర్యానికి ప్రతీక అల్లూరి
    • మనదే రాజ్యం స్ఫూర్తితో ఎంతోమందిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
  • 04 Jul 2022 11:48 AM (IST)

    అల్లూరి కుటుంబ సభ్యులకు సత్కారం..

    మన్యం వీరుడి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. రూ. 30 కోట్లతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు ప్రధాని.

  • 04 Jul 2022 11:40 AM (IST)

    కిషన్‌ రెడ్డి ప్రసంగం హైలెట్స్‌..

    • దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం
    • స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేశారు.. కాని ఆ బలిదానాల చరిత్ర ప్రస్తుత తరానికి తెలియదు
    • విప్లవవీరుడి తిరిగిన నేలకు రావాలని ప్రధాని మోడీని కోరాను
    • వెంటనే వస్తానని చెప్పి ఇప్పుడు మాటిచ్చి నిలుపుకున్నారు
    • అల్లూరి సంచరించిన ప్రాంతాలన్నీ తీర్థయాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
    • ఈ సంవత్సరం అంతా అల్లూరి పేరు మారుమోగాలి
    • అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడు
    • అల్లూరి సీతారామరాజు గురించి అందరూ తెలుసుకోవాలి.. స్ఫూర్తి పొందాల
    • అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
    • భీమవరానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం.
    • అదేవిధంగా వేదికను అలంకరించిన సీఎం జగన్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, చిరంజీవి, మంత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు
  • 04 Jul 2022 11:21 AM (IST)

    ప్రధానిని సన్మానించిన సీఎం జగన్‌..

    సభాస్థలిపై ప్రధాని నరేంద్రమోడీని ఘనంగా సత్కరించారు సీఎం జగన్‌. ప్రభుత్వం తరఫున జ్ఞాపిక అందజేశారు. అదేవిధంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రధానికి విల్లును అందించారు.

    భీమవరంలో ప్రధాని మోడీ పర్యటన విశేషాలను ఇక్కడ చూడండి..

  • 04 Jul 2022 11:00 AM (IST)

    భీమవరం చేరుకున్న ప్రధాని మోడీ..

    ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్ఠలికి చేరుకోనున్నారు.  అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మన్యం వీరుడి వారుసులతో ముచ్చటించనున్నారు. ప్రధాని వెంట గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఉన్నారు.

  • 04 Jul 2022 10:33 AM (IST)

    భీమవరం బయలుదేరిన ప్రధాని..

    గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన వెంట సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు.

  • 04 Jul 2022 10:32 AM (IST)

    మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు..

    గన్నవరం విమానశ్రయం వద్ద ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ హల్‌చల్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో బ్లాక్ బెలూన్లు, ప్లకార్డ్ పట్టుకొని గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సుంకర పద్మ శ్రీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే చేతుల్లో వున్న బ్లాక్ బెలూన్లు పగలకొట్టి, విమానాశ్రయం ప్రధాన గేట్ వద్ద కూర్చొని నిరసనకు దిగే ప్రయత్నం చేశారు.

  • 04 Jul 2022 10:16 AM (IST)

    గన్నవరం చేరుకున్న ప్రధాని..

    ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.  ప్రభుత్వం తరఫున ఆయనకు సీఎం జగన్,  స్వాగతం పలికారు.  అనంతరం ఒకే హెలికాప్టర్ లో మోడీ, గవర్నర్, సీఎం భీమవరం బయలుదేరనున్నారు.

    Whatsapp Image 2022 07 04 At 10.55.30 Am

  • 04 Jul 2022 10:13 AM (IST)

    మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు..

    గన్నవరం విమానశ్రయం వద్ద ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ హల్‌చల్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో బ్లాక్ బెలూన్లు, ప్లకార్డ్ పట్టుకొని గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సుంకర పద్మ శ్రీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే చేతుల్లో వున్న బ్లాక్ బెలూన్లు పగలకొట్టి, విమానాశ్రయం ప్రధాన గేట్ వద్ద కూర్చొని నిరసనకు దిగే ప్రయత్నం చేశారు.

  • 04 Jul 2022 10:10 AM (IST)

    ఎంతో గర్వంగా ఉంది..

    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణపై ఆయన మనవలు, మనవరాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరిని స్వయంగా తాము చూడకపోయినా.. ఆయన గురించి చెబుతుంటే చాలా గర్వంగా ఉంటుందని ఉప్పొంగిపోయారు.

  • 04 Jul 2022 10:08 AM (IST)

    ఎంపీకి వ్యతిరేకంగా ఆందోళనలు..

    మరో వైపు గుంటూరులో ఎంపీకి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంపీ రఘురామ గో బ్యాక్‌ అంటూ రైల్వే స్టేషన్‌ ముందు నిరసన తెలిపాయి. ఏపీలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు ఎంపీ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు కోసం కేటాయించిన ఇళ్లు కూడా ఇవ్వకుండా చేశారని ఆరోపించారు.

  • 04 Jul 2022 10:06 AM (IST)

    ప్రధాని సభకు ఆర్‌ఆర్‌ఆర్‌ దూరం..

    ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని సభకు వెళ్లాలని అనుకున్నా మధ్యలోనే విరమించుకున్నారు. లింగంపల్లి నుంచి ట్రైన్‌లో వెళ్లేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే భీమవరంలో పోలీసులు కార్యకర్తలను మరింత ఇబ్బంది పెడుతారన్న ఉద్దేశంతో బేగంపేట్‌లోనే దిగి పోయారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ర్యాలీ తీసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. దాదాపు 55 మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేశారన్నారు ఎంపీ.

  • 04 Jul 2022 10:03 AM (IST)

    చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్..

    అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. చిరంజీవిని గజమాలతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అందిన ఆహ్వానం మేరకు చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

  • 04 Jul 2022 10:01 AM (IST)

    ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం జగన్‌..

    గన్నవరం ఎయిర్‌పర్టులో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్‌. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వస్తున్న మోడీకి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రధాని, సీఎం,గవర్నర్‌ హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు.

  • 04 Jul 2022 10:00 AM (IST)

    అల్లూరి విగ్రహం విశిష్టతలివే..

    *రూ.3 కోట్ల వ్యయం

    *15 టన్నుల బరువు

    *30 అడుగుల పొడవు

  • 04 Jul 2022 09:41 AM (IST)

    ఎస్పీజీ ఆధినంలోకి గన్నవరం ఎయిర్ పోర్ట్..

    ప్రధాని రాక నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు. ఎస్పీజీ పోలీసులు విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమతి ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.

  • 04 Jul 2022 09:32 AM (IST)

    భీమవరం పర్యటనపై ప్రధాని ట్వీట్‌..

    భీమవరం పర్యటనపై మోడీ ట్వీట్‌ చేశారు..' ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరుతున్నాను. అక్కడ అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు మోడీ.

  • 04 Jul 2022 09:18 AM (IST)

    బేగంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరిన మోడీ..

    ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి గన్నరవం ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.

  • 04 Jul 2022 09:12 AM (IST)

    వాహనాల మళ్లింపు..

    ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. భీమవరం ASRనగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల వాహనాలను మళ్లిస్తున్నారు.

  • 04 Jul 2022 09:03 AM (IST)

    ప్రధాని పర్యటన వివరాలిలా..

    *ఉదయం 9.20కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఏపీకి బయలుదేరనున్నారు మోడీ.

    *10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

    * అక్కడి నుంచి గవర్నర్‌, సీఎం జగన్‌తో కలిసి ఒకే హెలికాప్టర్ లో భీమవరానికి బయలుదేరనున్నారు.

    * 10.55 గంటలకు భీమవరం చేరుకోనున్నారు ప్రధాని

  • 04 Jul 2022 08:56 AM (IST)

    ప్రధానికి వీడ్కోలు పలకనున్న మంత్రి తలసాని..

    ప్రధాని నరేంద్రమోడీ మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనతో పాటు మంత్రి తలసాని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానికి వీడ్కోలు పలకనున్నారు. కాగా ప్రధాని రాక సందర్భంగా బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ వద్ద భద్రతను పటిష్ఠం చేశారు.

  • 04 Jul 2022 08:44 AM (IST)

    వేదికపై వారికి మాత్రమే అవకాశం..

    భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానమంత్రి మోదీ పాల్గొనే ప్రధాన వేదిక పై 11 మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు.ప్రధాని, గవర్నర్, కేంద్రమంత్రి, సీఎం సహా మరో ఏడుగురికి అవకాశం కల్పించనున్నారు. ఇక వేదిక సమీపంలో వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. వేదికకు రెండు వైపులా మహిళలు , పురుషులకు వేర్వేరు గ్యాలరీలు ఉండగా.. ఒక్కో గ్యాలరీలో 500మందికి సిట్టింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఉన్నాయి. సభకు వచ్చే వారికి సెల్ ఫోన్లు అనుమతి లేదు

Published On - Jul 04,2022 8:39 AM

Follow us
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన