Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఊహాగానాలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలకు జరుగుతాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో YCP ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని..

Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఊహాగానాలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి..
Minister Peddireddy

Updated on: Jun 05, 2023 | 2:02 PM

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనేది తమకు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలకు జరుగుతాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో YCP ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఇతరుల సాయం కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని అన్నారు.

మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన తెలుగు దేశంపార్టీ మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు కర్ణాటక ఎన్నికల్లో జరిగిన మేనిఫెస్టోను, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో సింగల్‌గా పోటీ చేసే ధైర్యం లేకనే బీజేపీతో పొత్తుకోసం ఢిల్లీకి వెళ్లారన్నారు. సీఎం జగన్ పార్టీ మేనిఫెస్టోను ఒక కురాన్‌గా, బైబిల్‌గా. భగవద్గీతగా భావించి చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా నవరత్నాల్లో 99 శాతం అమలు చేశారన్నారు. లంచాలకు తావులేకుండా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను తీసుకెళ్లడం జగనన్న ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us