
ఆలయాల వద్ద నాగుపాములు హల్చల్ చేస్తున్నాయి.. తాజాగా..నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది ఆలయంలోని టెంకాయల కౌంటర్ వద్ద శనివారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమై హల్చల్ చేసింది. దీంతో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది, భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో తరచూ నాగుపాములు సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. టెంకాయల కౌంటర్ వద్ద నాగుపాము కనిపించిన విషయాన్ని అధికారులు స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్.. చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. అనంతరం దానిని సురక్షితంగా ఆలయ వెనక ప్రక్కన ఉన్న నల్లమల అడవిలో వదిలిపెట్టాడు. నాగుపాము పట్టుబడటంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆలయ పరిసరాల్లో పాముల సంచారం నేపథ్యంలో భక్తులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూన్నారు. ఏమైనా జంతువులు కానీ, పాములు కానీ, కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని .. వాటిపై దాడి చేయొద్దని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..