Boy death: బాలుడి ప్రాణాలు బలిగొన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ గొయ్యి.!

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్ లో విషాదం అలముకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ కొరకు తీసిన కుంటలో పడి జంగాలకాలనికి చెందిన నాలుగవ తరగతి

Boy death: బాలుడి ప్రాణాలు బలిగొన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ గొయ్యి.!
Child Dearth

Updated on: Sep 11, 2021 | 3:47 PM

Child died: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్ లో విషాదం అలముకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ కొరకు తీసిన కుంటలో పడి జంగాలకాలనికి చెందిన నాలుగవ తరగతి విద్యార్థి మల్లికార్జున మృతి చెందాడు. ఏపీ ఫైబర్ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మల్లికార్జున ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, డోన్ పట్టణంలోని వైయస్ నగర్ లో గత కొన్ని రోజులుగా భూమిలో కేబుల్ వైర్ ఉంచే క్రమంలో గుంత తీసి వదిలి వేశారు.

మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండడంతో సరదాగా ఈతకు వెళ్లిన మల్లికార్జున అందులో దిగడంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడ్ని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చిన్నారిని హుటాహుటీన చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు.

బాలుడు మల్లికార్జున నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడని బంధువులు తెలిపారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని నిండు ప్రాణం బలైపోయింది. తీసిన కుంటలు పూడ్చి పెట్టాలని తాము మొత్తుకుంటున్నా తమ గోడు పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

Follow Us