Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే
School

Updated on: Jun 18, 2023 | 9:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అలాగే ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని తెలిపింది. ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us