
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ప్రోగ్రామ్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారనే చర్చపై ఆమె స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని ప్రచారం జరిగేది. దీనిపై స్పందిస్తూ, జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజమని ఆమె సంకేతాలిచ్చారు.
తనకు మంత్రి పదవి రాకుండా, పార్టీలో ప్రాధాన్యత తగ్గించేలా పెద్దిరెడ్డి కుటుంబం చక్రం తిప్పిందన్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించలేదు. రాజకీయాల్లో ఎదుటివారిని తొక్కేయడం అనేది ఒక వ్యూహమని, తన విషయంలోనూ అది జరిగి ఉండవచ్చని ఆమె పరోక్షంగా అంగీకరించారు. వైసీపీలో ఒంటరి పోరు చేస్తున్నానని, సొంత సామాజిక వర్గం నుంచి కాకుండా, బయటి వ్యక్తుల నుంచి తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయకుండా కొందరు పెద్దలు అడ్డుపడ్డారనే విషయాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూ ద్వారా బహిర్గతం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..