
గుంటూ జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అమ్మాయి మీనాక్షి డిగ్రీ చదువుతుంది. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి ముఠా పనులకు వెల్తుండగా, రమణమ్మ హోటల్స్లో కూలీ పనులు చేస్తుంది. మీనాక్షి చదివే కాలేజ్లోనే రహీం చదువతుండగా.. అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఫోటోలు తీసుకున్నారు. అయితే రహీం ప్రవర్తన నచ్చకపోవడంతో మీనాక్షీ అతనికి దూరంగా ఉంటుంది. మీనాక్షి తనతో మాట్లాడకపోవఠంతో రహీం కక్ష పెంచుకున్నాడు. మీనాక్షి ఫోన్కి మెస్సెజ్లు పంపుతూ బెదిరిస్తున్నాడు. ఇద్దరి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించాడు. అయినా మీనాక్షీ పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో తనతో పాటు రూమ్కి రావాలని లేదంటే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ రహీం బెదిరింపులకు దిగాడు. మొదట పెద్దగా పట్టించుకోని మీనాక్షి రహీం బెదిరింపులు పెరిగిపోవడంతో మనో వేదనకు గురైంది. కూతురి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో రహీంతో తన పరిచయం దగ్గర నుండి మొత్తం జరిగినదంతా చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూతుర్ని ఓదార్చారు. అతని బెదిరింపులకు భయపడవద్దని చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా రహీం బెదిరింపులు ఆగలేదు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు, తమ్ముడు కాలేజ్కు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీనాక్షి ఫ్యాన్కు వ్రేలాడుతూ కనిపించింది. దీంతో లబోదిబోమనుకుంటూ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.