
Andhra Cabinet Meeting
ఆంధ్రప్రదేశ్లోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి వేళయింది. పండుగ వేళ.. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ఈ స్కీమ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే అకకాశం ఉంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది, ఇందులో 20 అజెండా అంశాలు చర్చించారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
- ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- జలవనరుల శాఖకి సంబంధించిన వివిధ పనుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- కారవాన్ పర్యాటక ప్రాజెక్ట్, అమృత్ పథకం 2.0 పనులకు ఆమోదం.
- రాజధాని అమరావతి భూసేకరణ: ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి ఆమోదం.
- అమరావతి వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు.
- రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం.
- కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించేందుకు చట్టసవరణ చేస్తామని నిర్ణయం.
- విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, అలాగే కార్మిక చట్టాల్లో సవరణలు మంత్రివర్గం ఆమోదించింది.
- గతంలో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే అనర్హతను నీటి సంఘాల ఎన్నికల నుంచి మినహాయింపుకు కేబినెట్ ఆమోదం
- హంద్రీ నీవాలో అమిద్యాల లిఫ్ట్ పనుల పునరుద్ధరణ
- ప్రకాశం బ్యారేజ్, దివిసీమలలో వరద నష్టం పనులకు ఆమోదం
- వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్కి 3.19 కోట్లతో మరమ్మత్తులు
- తిరుమల, తిరుపతికి నీటి ప్రాజెక్ట్ కోసం 126 కోట్లకు కేబినెట్ ఆమోదం