Vijayawada: 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాడమాసం సారె’ ప్రారంభం.. శాకంబరీ దేవీ ఉత్సవాలపై ఈవో కీలక ప్రకటన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు. జూలై 1 ,2 ,3 తేదీలలో ఆషాడ మాసంలో నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలు జరుపనున్నట్లు తెలిపారు.

Vijayawada: 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభం.. శాకంబరీ దేవీ ఉత్సవాలపై ఈవో కీలక ప్రకటన
Vijayawada Indrakiladri

Updated on: Jun 11, 2023 | 7:00 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు. జూలై 1 ,2 ,3 తేదీలలో ఆషాడ మాసంలో నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలు జరుపనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఆషాడంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహణ ఉంటుందన్నారు. శాకంబరీ ఉత్సవాలకు దాతల ద్వారా కూరగాయలు, పళ్ళు సేకరించనున్నట్లు చెప్పారు. జూలై రెండవ తేదీన ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాడ మాసం సారెను, బంగారపు బోనాన్ని హైదరాబాద్ మహంకాళి బోనాల కమిటీ సమర్పించనుందని తెలిపారు. సుమారు 5000 మందితో భక్తులతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, బేతాళ వేషాలతో హైదరాబాద్ మహంకాళి బోనాలు కమిటీ బోనాలు సమర్పించనుందన్నారు.

జులై 14న హైదరాబాద్ బోనాల కమిటీ వాళ్లు నిర్వహించే 8 గ్రామదేవతల ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులను మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ ఆహ్వానించినట్లు ఈవో భ్రమరాంబ వెల్లడించారు. కాగా శాకంబరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా ఏటా దేవతామూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us