AP Corona Cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. గణనీయంగా పెరిగిన రికవరీలు.. కొత్తగా ఎన్నంటే.!

|

Jun 15, 2021 | 6:47 PM

ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజూవారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి..

AP Corona Cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. గణనీయంగా పెరిగిన రికవరీలు.. కొత్తగా ఎన్నంటే.!
Coronavirus Cases In AP
Follow us on

ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజూవారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 96,153 శాంపిల్స్ పరీక్షించగా.. 5741 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,20,134కు చేరింది. ఇందులో 75,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు నిన్న 10,567 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో.. రికవరీ కేసుల సంఖ్య 17,32,948కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో మరో 53 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరుకుంది.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 353, చిత్తూరు 830, తూర్పుగోదావరి 831, గుంటూరు 385, కడప 325, కృష్ణా 463, కర్నూలు 130, నెల్లూరు 266, ప్రకాశం 463, శ్రీకాకుళం 428, విశాఖపట్నం 339, విజయనగరం 225, పశ్చిమ గోదావరి 703 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

అటు రాష్ట్రంలో రెండు జిల్లాలు రెండు ల‌క్షల‌కు పైగా కేసులు న‌మోదు చేయ‌గా.. మ‌రో 9 జిల్లాలు ల‌క్షకు పైగా కేసులు న‌మోదు చేశాయి. కేవ‌లం రెండు జిల్లాల్లో మాత్రమే లక్షకు లోపు కేసులు న‌మోద‌య్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్టడంతో..రాష్ట్ర ప్రభుత్వం క‌రోనా నుండి ఊపిరి పీల్చుకుంటుంది. క‌రోనా కేసులు తగ్గుతుండ‌టంతో క‌రోనా వ్యాక్సిన్‌పైనే ప్రభుత్వం ప్రధానంగా ఫోక‌స్ పెట్టింది.. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా.. దానిని ఎదుర్కునేందుకు కావాల్సిన విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి నుండి సన్నద్ధం అవుతోంది.

Also Read: ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!