Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. జనవరి 1 నుంచి పెరగనున్న పెన్షన్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేశారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. జనవరి 1 నుంచి పెరగనున్న పెన్షన్లు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
Ap Cabinet

Updated on: Dec 13, 2022 | 2:22 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. వచ్చే నెల అంటే జనవరి 1 నుంచి ఏపీలో పెన్షనర్ల పెన్షన్ మొత్తం పెరగనుంది. పెరిగిన మొత్తంతో కలిపి పెన్షనర్లకు రూ. 2,750 అందనుంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో దాదాపు 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ మీటింగ్‌లో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ట్యాబ్‌లు స్వయంగా మంత్రులే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పెంపు, ఆసరా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడప కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. జిల్లా అధ్యక్షులతో కలిసి సమస్యలు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. అలాగే, అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని బలంగా చెప్పుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు సీఎం జగన్. ప్రజలకు ఎంత చేస్తున్నా.. చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని అభిప్రాయపడ్డారు సీఎం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us