
తెలంగాణలో ఒంటిపూట బడులు, సెలవులపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఏపీ స్టూడెంట్స్ సైతం ప్రభుత్వం ఎప్పుడు సెలవులు ప్రకటిస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. మరో 2 రోజులు ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ వంటివి ఉండనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల ద్వారా అనధికారికంగా తెలిసింది. అయితే ఉష్టోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటే.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత వారికి హాలిడేస్ ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్ని ఆరు సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
పరీక్షల టైమ్ టేబుల్ ఫైనల్ చేసిన నేపథ్యంలో పబ్లిక్ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా ఆ రోజుల్లో పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. స్టూడెంట్స్కు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్షలను రాయాల్సి ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్స్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో అమోదించరని AP SSC బోర్డు గతంలో స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..