తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తానే చించేసిన వైసీపీ ఎమ్మెల్యే

| Edited By:

Sep 09, 2019 | 9:57 PM

తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తానే చించేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జరిగిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్‌తో సహా వెళ్లి పరిశీలించారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు కనబడటంతో కోటంరెడ్డి తొలగించారు. దర్గాలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసిన ఆయన.. ఆ బ్యానర్లను తొలగించారు. కాగా మంగళవారం నుంచి […]

తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ తానే చించేసిన వైసీపీ ఎమ్మెల్యే
Follow us on

తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తానే చించేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జరిగిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్‌తో సహా వెళ్లి పరిశీలించారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు కనబడటంతో కోటంరెడ్డి తొలగించారు. దర్గాలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసిన ఆయన.. ఆ బ్యానర్లను తొలగించారు.

కాగా మంగళవారం నుంచి రొట్టెల పండుగ జరగనుంది. మొహరం సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు నాలుగు రోజులు ఈ పండుగ జరగనుంది. ఈ వేడుకకు సుమారు 12 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రాజకీయాలకు తావు లేకుండా పండుగను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.